జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్స్ మరియు బీమా పత్రాల పంపిణీ

టీం జనసేన వై కోట ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్స్ మరియు బీమా పత్రాలు పంపిణీ కార్యక్రమం ఘనంగా ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగింది. వై కోట గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి అతిధులుగా సీనియర్ జనసేన నాయకులు పీ వీ ఎస్ మూర్తి, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, రాజంపేట సీనియర్ నాయకులు ఎం వెంకటేశ్వర్లు రావు, జనసేన కడప జిల్లా లీగల్ సెల్ ఇంచార్జ్ కర్ణాకర్ రాజు, కడప జిల్లా నాయకులు, రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం, చిట్వేల్ మండలం మరియు కోడూరు మండలం సైనికులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. పి వి ఎస్ మూర్తి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలను మరియు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న టీం జనసేన వై కోట సభ్యులను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పి వి ఎస్ మూర్తి ఆధ్వర్యంలో వైసిపి మరియు టిడిపి కార్యకర్తలు పార్టీలో చేరడం జరిగింది.