భైంసాలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

*తెలంగాణ లో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీకి సిద్ధం.. సుంకెట మహేష్ బాబు

భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనం ముందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శంకర్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి సైదాల శ్రీనివాస్ ఆదేశాల మేరకు.. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. భైంసానియోజకవర్గ సభ్యులకి జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు కిట్లను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల కోసం, జనసైనికుల కోసం దేశంలో ఏ పార్టీ లో లేని విధంగా.. సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికీ 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా.. పంటలు పండక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కోసం 30 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించి. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల ప్రతి కుటుంబాలకు ఒక లక్ష రూపాయలు చొప్పున తన స్వంత డబ్బు ఇస్తున్నన గొప్ప త్యాగ మూర్తి.. అదే విధంగా తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు ప్రమాదవశాత్తు మరణిస్తే.. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వారి ఇంటికి వెళ్ళి.. కుటుంబాలను కలిసి.. పరామర్శించి.. 5లక్షల చెక్కు ను అందజేయడం జరిగింది.. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో సర్పంచ్, ఎం పి టి సి, జడ్పీటిసి, ఎమ్మెల్యే, ఎంపి పదవుల కోసం పోటీ చేయడానికి సిద్దంగా వున్నాం.. ప్రతి నియోజక వర్గంలో 5 వేల ఓట్లను ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు కలిగిన పార్టీ గా భవిష్యత్ లో కార్యాచరణ రూపొందించి.. ప్రజల్లోకి వెళ్ళడానికి జన సైనికులు సిద్దంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జన సైనికులు అర్జున్, గణేష్, శివ, శేకర్, దయాకర్, నవీన్, భీం రాజ్, దాసు, ప్రమోద్, అజయ్ రెడ్డి, సలీం, సాహెబ్ రావ్, లక్ష్మణ్, నరేష్, వేణు తదితరులు పాల్గొన్నారు.