జక్కంపూడి, షాబాద్, రామరాజు నగర్ గ్రామాల్లో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

మైలవరం, కార్యకర్తల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన మహత్కార్యం ఐదు లక్షల రూపాయల భీమా మరియు సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా జక్కంపూడి, షాబాద్ గ్రామాల్లో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న క్రియాశీలక కార్యకర్తలకు సభ్యత్వ కిట్లను మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహరావు (గాంధీ) చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడ ఏ పార్టీ కూడా తలపెట్టని కార్యక్రమం అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం ఐదు లక్షల రూపాయలు భీమా పడకాన్ని తలపెట్టడం జనసైనికులు అదృష్టం అని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం చేయడానికి దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యవర్గ సభ్యులు చింతల లక్ష్మీ, మండల నాయకులు కొల రాజు, పోలిశెట్టి నాగబాబు, రాయుడు నాగరాజు, ముప్పిరి రవి రాజ, జక్కంపూడి, షాబాద్ గ్రామ నాయకులు దాసరి చంద్రయ్య, గంధం శివాజీ, గంధం వీరయ్య, రామిశెట్టి రాంప్రసాద్, మందపాటి సాయి, రమేష్, కిషోర్ మరియు గ్రామ పెద్దలు, వీరమహిళలు మరియు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.