నడుకూరులో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో మత్స. పుండరీకం ఐడి ద్వారా చేసిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం చెయ్యడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు బీపీ నాయుడు, జనసేన జానీ కర్నేన సాయి పవన్, ప్రణీత్ నడుకూరు గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడుతూ.. క్రియాశీలక సభ్యత్వం ముఖ్య ఉదేశ్యం ఏమిటి అంటే జనసేన పార్టీ నీ నమ్ముకున్న కార్యకర్తలకి ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చిన వారి యొక్క కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత జనసేన పార్టీ అదినాయకుడు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు తన బాధ్యతగా తీసుకున్నారు అని అన్నారు. బి.పి.నాయుడు మాట్లాడుతూ.. నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వున్నారని, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం లో వస్తున్న వినతులు పరిశీలించి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అటువంటి ప్రజా నాయకుడిని, జనసేన పార్టీ అభ్యర్థులను రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలిపిల్లి సింహచలం, వాన మహేష్, కంటు మురళి, మత్స.కృష్ణారావు, చింత గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.