నార్పలలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

నార్పల, జనసేన పార్టీ అధ్యక్షులు పవణ్ కళ్యాణ్ ఆదేశాలమేరకు క్రియాశీలక కిట్లను పంపిణీలో భాగంగా ఆదివారం నార్పల జనసేన కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం కిట్లను పంపిణి చేయడం జరిగింది. కార్యకర్తలకు ప్రమాద సమయంలో అండగా ఉండే విధంగా రుపొందించిన సభ్యత్వం కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.