పుంగనూరులో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

చిత్తూరు జిల్లా, పుంగనూరు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో నూకల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న జనసైనికులకు, వీర మహిళలకు ప్రమాద భీమా ధృవీకరణ పత్రంతో కూడిన, సభ్యత్వ కిట్స్ అందజేయడానికి ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నా రాయల్ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ విచ్చేసి పది సభ్యత్వాలు కంటే ఎక్కువ చేసిన వాలంటీర్లను సన్మానించి క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనిన నాయకులు రాష్ట్ర కార్యక్రమాలు ఐటీ వింగ్ పుంగనూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ మోహన్ కృష్ణ, మండల అధ్యక్షులు రెడ్డి శేఖర్, జనసేన నాయకులు మోహన్, నాగభూషణం, నియోజకవర్గ సీనియర్ నాయకులు జనార్ధన్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.