చిన్న మంగళపురం గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ

పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో సోమవారం పాలకొండ మండలం, చిన్న మంగళపురం గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ… సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రుల చేత గాజు గ్లాస్ గుర్తు పై ఓటు వేయించి జనసేన పార్టీ గెలుపుకు సహకరించాలని, అలాగే గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డొంక శివ ప్రసాద్ పాల్గొన్నారు.