ఎచ్చెర్లలో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, ఎచ్చెర్ల మండలం, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ఎచ్చెర్ల నియోజకవర్గం, ఎచ్చెర్ల మండలంలో రాష్ట్ర కార్య నిర్వహణ జాయింట్ కోఆర్డినేటర్, వైస్ ప్రెసిడెంట్ డా. విశ్వక్షేణ్ అధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీమతి దుర్గా ప్రశాంతి మరియు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటీర్లకు సన్మానం మరియు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం కిట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆనంద్, కాకర్ల బాబాజీ, రామారావు మరియు అధిక సంఖ్యలో జనసేనపార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.