వేంపెంట గ్రామంలో జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ

నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారందరికీ, 10, 11, 12 వ తేదీలలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న వారందరికీ కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగినది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో జనసేన సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి మొలక నాగమణి, జనసేన పార్టీ నాయకులు మొలక శేషు ఆధ్వర్యంలో, క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగినది, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన పార్టీవేంపెంట యూత్, శ్రీశైలం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శాలు బాషా తదితరులు పాల్గొన్నారు.