భామిని మండలంలో క్రియాశీలక సభ్యుల కిట్లు పంపిణీ

పార్వతిపురం జిల్లా, పాలకొండ నియోజకవర్గం భామిని మండలంలో బిల్లమడలో ఉన్న జనసేన పార్టీ మండల కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ చేపట్టిన క్రియాశీలక సభ్యులు కిట్లు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న క్రియాశీలక సభ్యుత్యం ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ విజయం కోసం పని చేయాలని, అలాగే ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుని, పరిష్కారం దిశగా అడుగులు వేయాలని తేలిజేయటం జరిగింది. గ్రామంలో పవన్ కళ్యాణ్ మనోగతాన్ని చదివి వినిపించాలని తెలియజేయటం జరిగింది. రాబోయే రోజుల్లో మండలంలో పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి. ప్రజలకు ఏవిధంగా చేరువుగా ఉండాలి అని మాట్లాడటం జరిగింది. అలానే రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వ స్థాపించడానికి క్రియాశీలక సభ్యులు కీలక పాత్ర పోషించాలని సూచించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కిరణ్, శ్రీనివాసరావు, మహేష్, దీపక్ కళ్యాణ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.