జనసేన ఆద్వర్యంలో దాన ధర్మ చారిటబుల్ ట్రస్టు వారి సహకారంతో నోటు పుస్తకాల పంపిణీ

అనంతపురం, జనసేన పార్టీ ఆద్వర్యంలో దాన ధర్మ చారిటబుల్ ట్రస్టు వారి సహకారంతో అనంతపురం జిల్లా, బుక్కరాయ సముద్రం మండలంలోని భద్రంపల్లి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అందరికీ నోటు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేటి బాలలే రేపటి పౌరులని వారు సమాజంలో గౌరవంగా బ్రతకాలంటే… వారి భవిష్యత్తు బాగుగా ఉండాలంటే చదువు మాత్రమే ఏకైక మార్గమని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్పా చంద్ర శేఖర్ తెలిపారు. జనసేన పార్టీ నాయకులను ఎవరు ఎంతగా తూలనాడినా వారి తాటాకు చప్పుళ్ళకు జనసేన పార్టీ బెదరదని ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహకులు జయశంకర్, నరశింహా, జనసేన పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి చొప్పా, చంద్ర శేఖర్, జనసేన పార్టీ నాయకులు రాగే శివ, సాకే కుళ్ళాయప్ప, జనార్దన్, రామాంజి మరియు భద్రం పల్లి చొప్పా, ఓబులపతి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.