పవర్ టిల్లర్‌ల పంపిణీ

తెలుగుదేశం-జనసేన-భాజపా కూటమి రైతు నేస్త ప్రభుత్వంగా నిరూపించుకుంటోంది. పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ అయినవిల్లి మండలం ఎంపిడిఓ కార్యాలయంలో సబ్సిడీ పవర్ టిల్లర్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, మెకానికల్ పరికరాల వినియోగం పెరిగితే రైతుల ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశ్యంతో సబ్సిడీపై పవర్ టిల్లర్‌లను అందజేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి అధిక దిగుబడి సాధించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ తరహా మరిన్ని పథకాలను త్వరలో తీసుకువస్తామని తెలిపారు.

పంపిణీ వివరాలు:
మొత్తం లబ్ధిదారులు: 6 మంది రైతులు
ఒక్కో పవర్ టిల్లర్ ధర: ₹2,29,500
సర్కారు సబ్సిడీ: ₹1,00,000
రైతు వాటా: ₹1,29,500
మొత్తం టిల్లర్‌ల ఖర్చు:₹13,77,000
ప్రభుత్వ సబ్సిడీ మొత్తం: ₹6,00,000
రైతుల భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment