జనసేన ఆధ్వర్యంలో పులిహోర మరియు మజ్జిగ పంపిణీ
విశాఖ పశ్చిమ నియోజకవర్గం, ఉగాది సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం, పారిశ్రామిక ప్రాంతం, మల్కాపురంలో జనసేన శ్రేణులు ప్రేమ్ కుమార్, వంశీ ఏర్పాటు చేసిన పులిహోర మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన యువ నాయకులు ముప్పిన ధర్మేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమ్, వంశీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి జనసేన పార్టీని మల్కాపురం ప్రజలలో విస్తృతంగా తీసుకువెళ్తునారు, ఇలాంటి యువత జనసేన పార్టీకి చాలా అవసరం అని తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-22-at-19.55.17-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-22-at-19.55.18-461x1024.jpeg)