కౌలు రైతులకు బియ్యం అందజేత

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాల గ్రామంలోరాష్ట్రంలో అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలురైతులను ఆదుకోవడానికి రైతు భరోసా యాత్ర చేస్తున్నజనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నిడదవోలుమండలం పెండ్యాల గ్రామ జనసేన పార్టీ ఎంపీటీసీ వాకా ఇంద్రాగౌడ్ ఆధ్వర్యంలో ఇటీవల గోదావరి వరదల కారణంగాపంటలు నష్టపోయిన కౌలు రైతులను గుర్తించి పెండ్యాలపరిధిలోని 55 మంది కౌలు రైతులకు ఒక్కొక్కరికి 25 కేజీలచొప్పున బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య,తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. తణుకు నియోజకవర్గ ఇన్చార్జ్ విడివాడ రామచంద్రరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నిడదవోలు నియోజకవర్గ జనసేననాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగాఎంపిటిసి నాకా ఇంద్ర గౌడ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న
వారిని ఆదుకోవడమే జనసేన అని, ఈ యొక్క కార్యక్రమానికిసహకరించిన నిడదవోలు నియోజకవర్గ జనసేన నాయకులకుజనసైనికులకు హృదయపూర్వక ధన్యవాదాలుతెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *