కాకినాడ సిటిలో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

కాకినాడ సిటి, జనసేన పార్టీ అధిష్టానం నిర్దేశించిన విధంగా మూడవరోజు కూడా నేడు 12వ తేదీన కాకినాడ సిటిలో ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యుల కిట్లను సాయంత్రం ముత్తా రైస్ మిల్లు కాంప్లెక్సు ఆవరణలో పంపిణీ చేస్తూ వాలంటీర్లకి చిరుసత్కారం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసే కూలీలెవరు అని శ్రీశ్రీ మాటలు గుర్తుచేస్తూ పవన్ కళ్యాణ్ అందరి సంక్షేమం ఆలోచించే నాయకుడని, ఆయన సారధ్యంలో ప్రజలకోసం మరిన్ని పోరాటాలు కలిసి చేద్దామన్నారు. జనసైనికులు మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ మాటల వ్యక్తి కాదని చేతల మనిషి అని కార్యకర్తల శ్రేయస్సు కోసం సొంత నిధులతో ప్రమాద భీమా సౌకర్యం కల్పించడం దీనికి ఉదాహరణ అని కొనియాడారు. అనుకోని సందర్భాలలో కుటుంబ పెద్దకి ఏదైనా ప్రమాదం జరిగినపుడు ఆ కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోకుండా కుటుంబం చిన్నా భిన్నం కాకుండా ఈ ప్రమాద భీమా కల్పించడం ఆయన ముందుచూపుకి నిదర్సనం అని ఇలాంటి నాయకత్వం మన రాష్ట్రానికి అవసరం అని నినందించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, ప్రొగ్రాం కమిటీ సెక్రటరీ కర్రి నానీ, మంగరాజు, యెర్రంశెట్టి చలపతిరావు, జాడా రాజు, అర్జున రాజు, రమణా రెడ్డి, దుర్గాప్రసాద్, రామక్రిష్ణ, చాట్ల చైతన్య, లోవరాజు, వీరబాబు, ఏసుబాబు, వరప్రసాదు, భాస్కర్, రమణ, సాయికుమార్, బడగంటి సురేష్, మరియు వీర మహిళలు ఎర్రంసెట్టి సునీత, సుర్ల లక్ష్మి, గంగాధర భవానీ, కళా సాయిదేవి, ఓలేటి భారతి, మాలతి, లీల, మారియా, శిరీష, పెద్దిరెడ్డి సంతొషి, ధనలక్ష్మి, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.