జనసేన ఆధ్వర్యంలో భక్తులకు టీ కాఫీ పంపిణీ

*పవిత్ర సంగమం వద్ద శివరాత్రి స్నానాలకు వచ్చిన భక్తులకు జనసేన సేవ
*జనసేన ఆధ్వర్యంలో భక్తులకు టీ, కాఫీ పంపిణీ

ఇబ్రహీంపట్నం, పవిత్ర సంగమం వద్ద శివరాత్రి స్నానాలకు వచ్చే భక్తులకు తమ వంతు సహాయం అందించారు జనసైనికులు. స్థానిక వచ్చే భక్తులకు మంచి నీటి సౌకర్యంతో పాటు టీ, కాఫీ, పాలు, పిల్లలకు బిస్కెట్లను పంచారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు బత్తిన శ్రీనివాస్ ఏర్పాటుచేసిన శిబిరాని మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల గాంధీ, జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు పోలిశెట్టి తేజ ప్రారంభించారు. పండగ సమయంలో ప్రజలకు సహాయపడటం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా జనసేన నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వై నరసింహారావు, జనసేన పార్టీ కార్యకర్తలు కుమార్, నాగబాబు, నాగేంద్ర, కృష్ణ మోహన్, సిరిపురం సురేష్ పాల్గొన్నారు.