జనసేన ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ

నెల్లూరు నగరంలోని స్థానిక ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు, ఎండ వేడిమికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తులకు జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ బాబు ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని 54 డివిజన్లో చిరు వ్యాపారులకు తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, వెంకటేష్, మనీ, వెంకటేశ్వర్లు సాయి, షారు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.