క్రియాశీలక సభ్యుల కిట్ల పంపిణీ పోస్టర్ విడుదల

దెందులూరు నియోజకవర్గం: అప్పనవీడు, ఏపూరు గ్రామ వీర మహిళలు మరియు జనసైనికుల ఆధ్వర్యంలో నవంబర్ 18వ తేదీన (శనివారం) సాయంత్రం 4 గంటలకి హనుమాన్ జంక్షన్ లో జరిగబోయే హనుమాన్ జంక్షన్, పెదపాడు మండలం, అప్పనవీడు, ఏపూరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కిట్ల పంపిణీ కార్యక్రమానికి సంభందించిన ఆహ్వాన పత్రికని ఆవిష్కరించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ బాధ్యులు డా.ఘంటసాల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో పెదపాడు మండల జనసేన నాయకులు గరికపాటి నాగేశ్వరరావు(చంటి), మోగంటి పవన్ కుమార్, కోటప్రోలు సురేశ్, దెందులూరు నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ కోటప్రోలు ఫణి కుమార్, అప్పనవీడు జనసైనికులు సర్దార్, డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు.