రొద్దం మండలంలో.. జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలంలో.. రొద్దం మండల అధ్యక్షుడు యూ. గంగాధర మరియు జనసైనికుల ఆధ్వర్యంలో యూ. గంగాధర అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చేనేత అధ్యక్షులు యేర్రిస్వామి మరియు జిల్లా కార్యదర్శి వి.సురేష్ పరిగి మండలం కన్వీనర్ ఆర్.సురేష్, పెనుకొండ మండల కన్వీనర్ మహేష్ పాల్గొని రొద్దం మండలంలో క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన వాలెంటీర్స్ ను ఘనంగా సన్మానించారు. ఇక్కడ రొద్దం మండల అధ్యక్షులు యూ. గంగాధర అత్యధికంగా పెనుకొండ నియోజకవర్గం లోనే క్రియా శీలక సభ్యత్వాలు నమోదు చేయిచడంలో మొట్ట మొదటి స్థానం దక్కించుకోవడం గమనార్హం. అలాగే కార్యక్రమంలో భాగంగా క్రియాశీలక సభ్యత్వాలు చేయించుకున్న జన సైనికులకు కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రొద్దం మండలం కమిటీ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు మరియు తదితరులు పాల్గొన్నారు.