కాకినాడ జిల్లా, పత్తిపాడు నియోజకవర్గం, రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో సినీ నటుడు రెడ్డి నారాయణమూర్తి కుటుంబ సభ్యులచే నిర్మించబడిన శ్రీశ్రీశ్రీ సీతారామ సమేత లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ దివ్య ప్రతిష్టాత్మక మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవానికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి బుల్లబ్బాయి మరియు రెడ్డి రామకృష్ణ ఆహ్వానం మేరకు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి & సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు శుక్రవారం స్వామి వారి దర్శనం పొందారు. అనంతరం ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా నిర్వహించిన హోమాది కార్యక్రమాల్లో పాల్గొని వేదపండితుల ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసుతో పాటు జిల్లా టెలికమ్యూనికేషన్స్ సలహా మండలి సభ్యులు మేకల కృష్ణ, దుర్గాడ గ్రామ జెడ్పీ హైస్కూల్ చైర్మన్ శాఖ నాగేశ్వరరావు (నాగు), మాజీ చైర్మన్ కందా శ్రీనివాస్, మొగిలి శ్రీను, కాపారపు వెంకటరమణ, మేడిబోయిన శ్రీను, కొప్పుల చక్రధర్, మంతిన గణేష్, కొలా నాని, సఖినాల లచ్చబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment