గొల్లల రామాలయం ప్రాంతంలో దివ్యాంగుల భరోసా యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ నాయకులు పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలమేరకు చోడిశెట్టి శ్రీమన్నారాయణ మరియు మావులూరి సురేష్ ల ఆధ్వర్యంలో 27 & 28వ డివిజన్లలో గొల్లల రామాలయం ప్రాంతంలో శనివారం దివ్యాంగుల భరోసా యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యాత్రలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు దివ్యాంగులు మన్యం రమాదేవి, రేలంగి సూరిబాబులను కలిసి వారితో వారి సమస్యలపై చర్చించి భరోసానిచ్చే ప్రయత్నం చేసారు. లోగడ ప్రభుత్వాలు దివ్యాంగులకి రకరకాల ఉపాధినిచ్చే అవకాశాలను సృష్టించి కలగచేసేవారనీ, అంతే కాకుండా వారికి అనుగుణమైన పనులలో వారికి ప్రాధాన్యతని ఇచ్చి ప్రోత్సహించేవారనీ, కానీ నేడు ఈ వై.సి.పి ప్రభుత్వంలో అసలు వీరిని గుర్తించిన పాపాన పోలేదన్నారు. అసలు ఈ ముఖ్యమంత్రి వీరి సంక్షేమానికి బడ్జెట్లో ఎన్ని నిధులని కేటాయించారు. వాటిలో ఎంత ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్ చేసారు. దివ్యాంగుల తరపున తమ పార్టీ పోరాడుతుందనీ రాబోయే జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వంలో మెరుగైన నిర్ణయాలతో దివ్యాంగుల సంక్ష్యేమ కార్యక్రమాలను చేపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.