జగనన్నకాలనీలు, టిడ్కో గృహాలు సందర్శించిన డి ఎమ్ ఆర్ శేఖర్
డా. బి ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న ఇళ్ళ పేరుతో జరుగుతున్న మోసాలు, అవకతవకలను బయటపెట్టి ప్రజలకు న్యాయం జరిగే విధంగా సోషల్ ఆడిట్ నిమిత్తం కార్యక్రమం రూపొందించారు. ఈ కార్యక్రమంలో బాగంగా అమలాపురం జనసేన పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ డి ఎమ్ ఆర్ శేఖర్ ఆధ్వర్యంలో అల్లవరం మండలం, బోడసకుర్రు గ్రామంలోని జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లను సందర్శించి లబ్ధిదారుల సమస్యలను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నల్లా శ్రీధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ యాళ్ల నాగ సతీష్, కంచిపల్లి అబ్బులు, ఇసుకపట్ల రఘుబాబు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, ఉండ్రు భగవాన్ దాస్, లింగోలు పండు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, ఆర్.డి.యస్.ప్రసాద్, పోలిశెట్టి బాబులు, వాకపల్లి వేంకటేశ్వర రావు, పడాల నానాజీ, తిక్కా ప్రసాద్, డి.యస్.యన్.కుమార్, అల్లాడ రవి, నిమ్మకాయల రాజేష్, కంకిపాటి గోపి, కరాటం వాణి, బండారు వెంకన్నబాబు, సాధనాల మురళి, పరమట చిట్టిబాబు, పాలూరి నారాయణ స్వామి, గంధం శ్రీనివాస్, పోలిశెట్టి మహేష్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-12-at-7.06.56-PM-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-12-at-7.06.57-PM-1024x647.jpeg)