జనగళం సభకు భారీ జన సందోహంతో డి.యం.ఆర్

అమలాపురం, ఎన్డీఏ కూటమి నేతృత్వంలో జనగళం పేరుతో చిలకలూరిపేటలో ఆదివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభకు అమలాపురం జనసేన పార్టీ నాయకులు డి.యం.ఆర్.శేఖర్ ఆధ్వర్యంలో భారీగా నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తరలివెళ్లారు. అమలాపురం పట్టణంలో కార్లతో ర్యాలీ నిర్వహించి సభకు బయలుదేరారు. ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వేదికపై నుండి ప్రసంగించారు. ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అధినాయకత్వం సూచనలతో ముందుకు సాగుతామని ఈ ఎన్డీయే కూటమి విజయానికి అహర్నిశలు కృషి చేస్తామని డి.యం.ఆర్.శేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డి.యం.ఆర్.శేఖర్, కంచిపల్లి అబ్బులు, ఇసుకపట్ల రఘుబాబు, మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, సలాది వెంకట రమణ, లింగోలు పండు, పడాల నానాజీ, ఆర్.డి.యస్.ప్రసాద్, పరమట చిట్టిబాబు, డి.యస్. యన్.కుమార్, పాలూరి నారాయణ స్వామి, పోలిశెట్టి కన్నా, గంగబత్తుల కిషోర్, నల్లా వెంకటేశ్వర రావు, అల్లాడ రవి, సత్తి చిన్న, కంకిపాటి గోపి, నిమ్మకాయల రాజేష్, కరిముల్ల బాబా, షఫీ ఉల్లా, నల్లా మూర్తి, నిమ్మకాయల సాయి, బోణం రాంబాబు మరియు జసైనికులు, నాయకులు పాల్గొన్నారు.