పారిశుధ్య సిబ్బందిని ఇబ్బందులు పెట్టకండి: బాడిశ మురళీకృష్ణ

పారిశుధ్య కార్మికులను ఇబ్బందులు పెట్టవద్దని ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బాడిశ మురళీకృష్ణ అధికారులను కోరారు పెనుగంచిప్రోలు శ్రీలక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానంలో పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వారి బాధలను బాడీశ మురళీకృష్ణకు వారు పడుతున్న బాధలను వివరించారు. ఈ సందర్బంగా పారిశుధ్య కార్మికులు మాట్లాడుతూ సకాలంలో వేతనాలు అందటం లేదని అధికారులను అడిగితే వ్యాపారాలు ఇవ్వడం లేదు మీరెల్లి అడగండి లేకపోతె మానెయ్యండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని అంతకుముందు సిబ్బందికి భోజన సదుపాయం కల్పించారని ఇప్పుడు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం లేదు అని వివరించారు. ఈ సందర్బంగా బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ అధికారులు తక్షణమే స్పందించి పారిశుధ్య వేతనాలు వ్యాపారులతో సంబంధం లేకుండా దేవస్థానమే నేరుగా వారికి అందించేలా చూడాలని అలాగే వారికీ ప్రతిరోజూ భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయాలనీ బాడిశ మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.