బండి దంపతులను పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, దొంతమూరు గ్రామానికి చెందినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన కార్యదర్శి బండి ఏసుబాబు వారి సతీమణి బండి కుమారి ఇటీవల బైక్ యాక్సిడెంట్ కారణంగా గాయాలయి మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు, విషయం తెలుసుకొన్న బండి ఏసుబాబు శ్రీమతి కుమారి లను పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించి, సంబంధిత డాక్టర్ తో సంప్రదించి, తగిన సలహాలను సూచనలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, బొజ్జ గోపికృష్ణ, సామినేడి అప్పన్న, మత్స్యకార నాయకులు పల్లేటి బాపన దొరగారు, పల్నాటి మధు, కంద చక్రబాబు, కారిపిరెడ్డి వెంకటేష్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.