ఏరియా ఆసుపత్రిలో వైద్యులను నియమించాలి: జనసేన వీరమహిళలు డిమాండ్

కోనసీమ జిల్లా, జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం వీరమహిళల ఆధ్వర్యంలో స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్యులను నియమించాలని ముఖ్యంగా ప్రసూతి వైద్యనిపుణులను గైనకాలజిస్టును నియమించాలని డిమాండ్ చేసారు. పీహెచ్సీలకు యాంటీ రాబిస్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాలని కోరుతూ సోమవారం కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ కు విజ్ఞాపనపత్రం అందజేశారు. నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు సూచనల మేరకు జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో వీరమహిళలు చిక్కం సుధారాణి, పట్టణ కౌన్సిలర్లు పిండి అమరావతి, గండి హారికదేవి, ఎంపిటిసిలు నాగులాపల్లి శేషువేణి, తాళ్ళ లక్ష్మీనరసాయమ్మ, దోనిపాటి బాలమ్మ, సర్పంచ్ చిట్నీడి శ్రీదేవి, వీరమహిళలు ముత్యాల మణి, గోళ్ళ కమల, నల్లా వరలక్ష్మి, మోసుగంటి మల్లిక, నార్ని అమ్మాజీ, చవటపల్లి పుష్పంజలి, కామాడి గంగాభవాని, కర్రీ లక్ష్మిదుర్గ, పలువురు మహిళలు పాల్గొన్నారు.