డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం 45వ వారం

  • సాయిసేవా సమితి వారి ఆధ్వర్యంలో 83వ వారం ఘనంగా నిర్వహణ

పిఠాపురం నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి పిఠాపురం నియోజకవర్గము జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ఏర్పాటుచేసిన శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు గత 44 వారాలుగా ప్రతి శనివారం రైతులకు అన్నసదుపాయమును కల్పించుచున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 45వ వారం శనివారం రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చిన ఔట్ పేషెంట్లకు కలిపి అన్నపానీయం సదుపాయమును కల్పించారు. ఈ కార్యక్రమంలో సాయిప్రియసేవా సమితి వ్యవస్థస్థాపక అధ్యక్షులు & తూర్పుగోదావరిజిల్లా జనసేన పార్డీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు స్వయంగా అన్నపానీయాలను వడ్డించారు. అనంతరం రైతులతో కలిసి ఉచిత అన్నపానీయసదుపాయంపై తమ తమ అభిప్రాయాలను అడిగి తెలుసుకోన్నారు. జ్యోతుల శ్రీనివాసుతో పాటు పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లం కిషోర్, చేబ్రోలు గ్రామ జనసేన నాయకులు గంటా గోపి, సఖినాల లచ్చబాబు, దుర్గాడ గ్రామానికి చెందిన జ్యోతులసీతరాంబాబు, వెలుగుల వాసు, జ్యోతుల నాని, విప్పర్తి శ్రీను, విప్పర్తి కృపాకర్ తదితరులుఆహరపా నీయ వడ్డనలో తమ సేవలను అందిస్తున్నా శ్రీమతి డోక్కా సీతమ్మ అన్నపానీయసదుపాయ కేంద్రమునకు శ్రమశక్తి ద్వారా రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, పేషెంట్ లకు ప్రత్యేకమైన సేవలు అందిస్తూన్నారు, సాయిప్రియ సేవాసమితి కార్యక్రమానికి సేవలందిస్తున్నారని వారిని జ్యోతుల శ్రీనివాసు ప్రత్యేకంగా అభినందించారు.