రాయపురెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహారనిధి

మాడుగుల, కె.కోటపాడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాన్ని అనుసరించి మహోన్నత మహిళామణి, ఆంధ్రుల అన్నపూర్ణమ్మ దివంగత డొక్కా సీతమ్మ ఆహారనిధి కార్యక్రమంలో భాగంగా అన్నదానం చేయడం మహా భాగ్యంగా భావిస్తున్నానని జనసేనపార్టీ మాడుగుల నియోజకవర్గం నాయకులు మరియు రాయపురెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాయపురెడ్డి కృష్ణ అన్నారు. ఇక్కడి శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం పేదలకు, సాయి భక్తులకు అయన విరాళంతో అన్నసమారాధన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణ మాట్లాడుతూ ఆకలికి అందరూ సమానమేనని, పేదాధనిక తేడాల్లేవన్నారు. జనసేనపార్టీ మండల నాయకులు కుంచా అంజిబాబు మాట్లాడుతూ నియోజకవర్గం నాలుగు మండలాల్లో డొక్కా సీతమ్మ ఆహారనిధి కార్యక్రమం అమలు చేస్తున్న రాయపురెడ్డి కృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముమ్మిన సతీషు, ఇస్మార్ట్ శంకర్, హరీష చౌడువాడ జనసైనికులు ఉమా మహేష్, మణికంఠ, చుక్క నారాయణమూర్తి గంగునాయుడు, శ్రీను, కోనేటి రాజు, కొచ్చెర్ల వరహాలు, సాయిభక్త సేవకుడు యాళ్ళ సాయి తదితరులు పాల్గొన్నారు.