డొక్కా సీతమ్మ గారి సేవారథం ప్రారంభించిన గుడివాడ పట్టణ జనసైనికులు

కృష్ణాజిల్లా, గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆర్.కె వారియర్స్ ఆకలితో ఉన్న అనార్థులకు ఆకలి తీర్చడానికి మరియు అనాధ మృతదేహాలు తీసుకెళ్లేందుకు ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి సేవారథం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (ఆర్.కె) మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంతో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సోమవారం గుడివాడ పట్టణంలో కుల మతాలతీతంగా ఆంధ్రుల ఆన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి సేవారథం ప్రారంభించడం జరిగిందని తెలియజేసారు. అదేవిధంగా గుడివాడ పట్టణంలో శుభకార్యాలలో మరియు వివిధ ఫంక్షన్లలో ఆహారం మిగిలిపోయిన ఎడల మా వారియర్స్ కి సమాచారం అందజేసినచో ఆ ఆహార పదార్థాలను ఆకలితో అన్నార్తులకు మరియు పేద ప్రజలకు అందజేయడం జరుగుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన షేక్ మీరా షరీఫ్, సుబ్రహ్మణ్యం, అయ్యప్ప, షేక్ కరీం, సురేష్, చరణ్, నాగ సాయి, మరియు జనసైనికులు పాల్గొన్నారు.