అంతర్వేది దేవస్థానానికి జనసేన ఎంపిపి చేతుల మీదుగా విరాళం

రాజోలు, మల్కిపురం మండలం గుడిమెళ్ళంక గ్రామవాసులు ముత్యాల శ్రీను, కుమారి దంపతుల కుమారుడు పవన్ ట్రిపుల్ ఐటిలో అథ్యధిక మార్కులతో ఉద్యోగం పొంది తన మొదటి నెల జీతం అంతర్వేది లక్ష్మి నరసింహ‌స్వామి దేవస్థానం నిత్యాన్నదానం నిమిత్తం రూపాయలు 1,00,000/-(లక్ష రూపాయలు) మరియు నిత్య హోమ పూజల నిమిత్తం రూపాయలు 20,000/-(ఇరవై వేల రూపాయలు) మల్కిపురం మండలం జనసేన పార్టీ ఎంపిపి మేడిచర్ల వెంకట సత్యవాణి రాము చేతుల మీదుగా ఆలయ సిబ్బందికి అందచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.