*జనసేన నాయకురాలు బత్తుల వెంకట లక్ష్మి
సీతానగరం మండలం కాటవరం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పాశాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి ప్రత్యేక ఆహ్వానంతో హాజరైన జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకట లక్ష్మి అమ్మవారిని దర్శించి గ్రామ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో చర్చించి, జాతర మహోత్సవానికి లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:
Post Comment