పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ అధ్వర్యంలో అన్నదానం

దళిత రత్న, మాల మహానాడు యూత్ ప్రెసిడెంట్ గద్ద సాయికుమార్ పుట్టినరోజు సందర్బంగా వర్ధన్ అనాధ ఆశ్రమంలో పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ అధ్వర్యంలో చిన్నారుల మద్య కేక్ కట్ చేసిన అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మేకల మహేష్, మురళి, విజయ్, మార్క ప్రశాంత్, హాజరయ్యారు. ఈ సందర్బంగా సాయికుమార్ మాట్లాడుతూ ఇలా చిన్నారులతో పుట్టినరోజు వేడుక చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జోగు భాస్కర్, సాయి, రంజిత్, జోగు ఉదయ్, నలిన్, నాని, మను, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.