సినిమాలపై రివ్యూలు కాదు నీటి ప్రాజెక్టులపై రివ్యూలు చేయండి అంబటి

ఎమ్మిగనూరు: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాపై రివ్యూలు మానేసి రాష్ట్రంలో ఉన్న నీటి ప్రాజెక్టులపై రివ్యూలు చేయాలని అంబటి రాంబాబుకు జనసేన నాయకులు సూచించారు. పట్టణంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు రవి ప్రకాష్, కర్ణం రవి, రాహుల్ సాగర్ లు మాట్లాడుతూ అంబటి రాంబాబు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రి హోదాలో ఉండి సినిమాల పైనా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు మాని రాష్ట్రంలో పూర్తి కానీ ప్రాజెక్టులపైనా రాష్ట్ర అభివృద్ధి పైనా సత్తెనపల్లిలో మిమ్మల్ని గెలిపించిన ప్రజా సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ఏ సమస్యలు లేనట్టు రాష్ట్ర మంత్రి అయ్యుండి రాష్ట్ర ప్రజల నుండి జీత భత్యాలు తీసుకుని తమకి ఇచ్చిన శాఖల గురించి మీటింగ్ పెట్టాలని, కానీ సినిమాలు గురించి పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని దోచుకుంటూ ప్రజలకోసం కాకుండా మీ పబ్లిసిటీ కోసం పని చేయడం ఏ మాత్రం సమంజసం కాదని హితవుపలికారు. మీరు సినిమాలపై రివ్యూలు చెప్పాలంటే మీ మంత్రి పదవికి రాజీనామా చేసి 24 గంటలు సినిమా రివ్యూలు చేసుకోవచ్చునని అన్నారు. ఇక మీదట మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్, నవాజ్, వెంకీ తదితరులు పాల్గొన్నారు.