దొంతా నరేష్ మరణం జనసేన పార్టీకి తీరని లోటు

గుంటూరు, జనసేన పార్టీ నాయకుడు, బీసీ యువ నేత దొంతా నరేష్ మరణం జనసేన పార్టీకి తీరని లోటని రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త బోనబోయిన శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రాత్రి అనారోగ్యంతో మరణించిన దొంతా నరేష్ పార్ధీవదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పవన్ కల్యాణ్ పై గుండెల నిండా ప్రేమను నింపుకోవటమే కాకుండా ఆయన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో నరేష్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. జనసేన క్రియాశీలక కార్యకర్తగా పార్టీ బలోపేతానికి నిరంతరం పాటుపడ్డారన్నారు. తన ఆఖరి శ్వాస వరకు నరేష్ జనసేన పార్టీ కోసం శ్రమించారని జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. దొంతా నరేష్ కు శ్రద్దాంజలి ఘటించిన వారిలో పార్టీ నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు, అడపా మాణిక్యాలరావు, నారదాసు ప్రసాద్, ఆళ్ళ హరి, దాసరి వాసు, బండారు రవీంద్ర, మెహబూహ్ బాషా, మిరియాల వెంకట్, కొడగంటి రవి, కదిరి సంజీవ్, సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోశయ్య, గుర్రాల ఉమ, మధులాల్, జెట్టి బాబు, దాసరి వెంకటేశ్వర్లు, నండూరి స్వామి, సుబ్బారావు తదితరులున్నారు.