నందలూరు మండలంలో ఇంటింటికీ ప్రచారం

రాజంపేట ఎన్డీయే కూటమి అభ్యర్థులైన ఎంపీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం లకు నందలూరు మండలంలో నాయకుల మద్దతు కూడగట్టేందుకు మూడు పార్టీల నాయకులు విస్తృతంగా పర్యటించడం జరిగింది. రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస ఆదేశానుసారం నందలూరు మండలంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలవాలని సోమవారం పాటూరు పంచాయతీ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కూటమి నాయకులు. అనంతరం ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి అభ్యర్థులు ఎంపీ ఎమ్మెల్యేలుగా రాజంపేటలో విజయకేతనం ఎగరవేయడం తద్యమని వారు ఘంటాపథంగా తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పాలక పక్షానికి తీవ్ర వ్యతిరేకత ఉందని భవిష్యత్తులో ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం తథ్యమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు, తెలుగుదేశం నాయకులు సమ్మెట శివప్రసాద్, యెద్దల విజయసాగర్, బీజేపీ నాయకులు షబ్బీర్ అహ్మద్, అరిగె రాంప్రసాద్, వినోద్ వర్మ, తోట నాగేశ్వరరావు, జయచంద్రారెడ్డి, ఆకుల చలపతి తదితరులు పాల్గొన్నారు.