15వ వార్డులో ఇంటింటికి జనసేన

సత్తెనపల్లి నియోజకవర్గం, ఆదివారం సత్తెనపల్లి టౌన్ లో 15వ వార్డులో రామిశెట్టి శ్రీనివాసరావు మరియు తోట బాలాజీల ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన అనే కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు పాల్గొని ఇంటింటికి జనసేన కరపత్రాన్ని ఇస్తూ 15వ వార్డులో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ, వార్డు సమస్యలు తెలుసుకుంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిసెట్టి సాంబశివరావు, అంపిరని రాజశేఖర్, కౌన్సిలర్ నాలుగు మండల అధ్యక్షులు సుమన్, బత్తుల కేశవ, నామాల పుష్ప, బీసీ నాయకులు, మైనార్టీ నాయకులు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.