పేట చెరువు, గుడిపాడు గ్రామాలలో ఇంటింటికి జనసేన ప్రచారం
కొత్తగూడెం నియోజకవర్గం: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నందున్నజనసేన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొత్తగూడెం నియోజకవర్గం, పాల్వంచ మండలంలో ఇంటింటికి గడపగడపకి జనసేన అంటూ పేట చెరువు, గుడిపాడు గ్రామాలలో పర్యటించి గ్రామస్తుల్ని, పేద ప్రజలని, మరియు రైతులని వారి సమస్యలను జనసేననాయకులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జి వేముల కార్తిక్, పాల్వంచ మండలం అదక్షుడు ఓలపల్లి రాంబాబు, ప్రసాద్, వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. అలాగే రాబోయే రోజుల్లో వారికి ఏ సమస్య వచ్చిన జనసేన అండగా ఉంటుంది అని తెలియచేసి రాబోయే అసెంబ్లీ ఎలెక్షన్స్ లో జనసేన కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీ చేయటం జరుగుతందని తెలియ జేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-30-at-5.03.09-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-30-at-5.03.10-PM.jpeg)