బనగానెపల్లి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

బనగానెపల్లి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను జనసేన పార్టీ నాయకులు భాస్కర్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు భారతదేశం నిలవడానికి ప్రధాన కారకులు అంబేద్కర్ అని బడుగు బలహీన వర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోదుడన్నారు. ప్రభుత్వ ఫలాలందరికి చెందాలని, సామాజికంగా, ఆర్థికంగా అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించడంతో నేటికీ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తోందన్నారు. విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహౌన్నత వ్యక్తి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, షేక్షావలి, సుబ్బరాయుడు, రాజు, సుభాన్, శంకర్, పాతపాడు శంకర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.