మృతుని కుటుంబానికి అండగా డాక్టర్ కందుల

విశాఖపట్టణం, నగరంలోని జీవిఎంసి పరిధి 36వ వార్డు రంగిరీజు వీధికి చెందిన గొడ్ల మధుసూదనరావు అనే నిరుపేద గురువారం చనిపోగా వారి కుటుంబీకులకు విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు డాక్టర్ కందుల నాగరాజు ధనసహాయం చేసి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ప్రేమాభిమానాలు చూపిస్తూ ఆదరిస్తున్న దక్షిణ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు ఏ ఇబ్బందుల్లో ఉన్నా తాను సహాయం చెయ్యడానికి ముందుంటానన్నారు. వారికి తాను ఎన్ని సేవలు చేసినా తక్కువేననియు, వారు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలను జీవితాంతం తాను గుర్తుంచు కుంటానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు ఉసిరికాయల యజ్ఞశ్రీ, కుమారి, దక్షిణ నియోజకవర్గ జనసేన యువ నాయకులు కందుల కేదార్ నాథ్, కందుల బధరీనాథ్ తదితరులు పాల్గొన్నారు.