విశాఖ, సేవే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు, ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై ఉన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని, తన పరిధిలోవున్న సాయాన్ని వారికి అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటున్నారు. ఈ క్రమంలో 32వ వార్డు, ఏడుగుళ్ళ ప్రాంతానికి చెందిన వందేళ్ళ అప్పయ్యమ్మ మృతి చెందగా, ఆమె అంత్యక్రియలకు డాక్టర్ నాగరాజు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “వార్డులో మాత్రమే కాకుండా, నియోజకవర్గం అంతటా ఎవరికైనా అవసరం ఏర్పడితే, తాను ముందుండి తోడ్పాటునిస్తాను” అని అన్నారు. అలాగే, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సహకారంతో, మరిన్ని మానవతా కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశంగా, తనకు సహకరిస్తున్న కూటమి నాయకులకు, వార్డు ప్రజలకు, జనసైనికులకు, వీర మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Share this content:
Post Comment