డా. బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులర్పించిన మాధవరెడ్డి

శేరిలింగంపల్లి: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, దళిత తొలి ఉపప్రధాని, సమసమాజ స్థాపనకై కృషి చేసిన కృషీవలుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుడికి జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ మాధవరెడ్డి జగ్జివన్ రామ్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాధవ రెడ్డి మాట్లాడుతూ.. బాపూజీ గారు 27 సంవత్సరాల వయసులోనే రాజకీయాల్లో అడుగు పెట్టి, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పోరాటం చేశారు. యువత బాపూజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లో ముందుకు రావాలి అన్నారు. ఎప్పుడైతే యువత రాజకీయాల్లో పాల్గొంటారో అప్పుడే నవ సమాజం నిర్మాణం అవుతుంది. బాపూజీ గారు దేశం కోసం చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హనుమంతు నాయక్, ప్రశాంత్, దుర్గాప్రసాద్, గాంధీ, మరియు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.