కుప్పం జనసేన నాయకులతో డా.పసుపులేటి హరిప్రసాద్ సమావేశం

కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులతో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ పార్టీ ఆఫీసు నందు సమేవేశం కావడం జరిగింది. నియోజకవర్గంలోని సమస్యలు మరియు పార్టీ బలోపేతం కోసం రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై డా.పసుపులేటి హరి ప్రసాద్ తో చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుల వారు మరీ ముఖ్యంగా “నా సేన కోసం నా వంతు” అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల కమిటీ సభ్యులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.