ఆరణి శ్రీనివాసులుకు మద్దతుగా డా.పసుపులేటి ప్రచారం

తిరుపతి ప్రచారంలో భాగంగా 28,30,31,36,37 వ వార్డ్ లో జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుతో ప్రచారంలో పాల్గొన్న జనసేన జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఊక విజయ్ కుమార్, జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి నాయకులు. తిరుపతిలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులుకు ప్రజలు బ్రహ్మరధం పట్టిన 28,30,31,36,37 వ వార్డులో జనసేన నాయకులు ఘనంగా ఆహ్వానించారు. దోచుకునే దాచుకునే నాయకులను చూసాం, భావి తరాల భవిష్యత్తు కోసం రాబోవు ఎన్నికల్లో మన గాజు గ్లాసు గుర్తు పై ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం పని చేద్దాం.
పవన్ కళ్యాణ్ గారు నియమించిన తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ అరణి శ్రీనివాసులు గారిని అత్యంత మెజారిటీతో గెలిపించి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానుకగా ఇద్దాం. మనల్ని ముందుకి తీసుకెళ్ళే సైనికుడు లాంటి గొప్ప నాయకుడి వెంట మనం నడుస్తున్నాం, అలాంటి గొప్ప నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అయన యుద్ధం మనకోసం చేస్తున్నారు ఆయనకి తోడుగా మనం యుద్ధంలో చేయాలి. రాబోవు ఎన్నికల్లో డబ్బుకోసం కాదు మన భావితరాల భవిష్యత్ కోసం మనం యుద్ధం చేయాలి. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడిని గెలిపించి సీఎం చేద్దాం అంటూ ప్రజలను ప్రభావితం చేయాలి అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ కిరణ్ రాయల్, రాష్ట్ర కార్యదర్శి అకేపాతి సుభాషిణి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి హేమకుమార్, జనసేన టీడీపీ బీజేపీ నాయకులు జనసైనికులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.