గాంధీ మహాత్మునికి డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ ఘన నివాళులు

పిఠాపురం: జాతిపిత మహాత్మా గాంధీ గారు చూపించిన శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అలవరుచుకొని జీవితంలో విజయాలు సాధించాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్, డాక్టర్ పిల్లా దీపిక తెలియజేశారు.. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పిఠాపురం పట్టణం ఉప్పాడ సెంటర్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ మరియు డాక్టర్ పిల్లా దీపిక పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా జనసైనికులు, వీరమహిళలు కూడా గాంధీజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్లా శివశంకర్, పల్నాటి మధు, వాకపల్లి సూర్య ప్రకాష్, కొండపల్లి శివ, మోటూరి మహేష్, పిల్లా శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.