మహాశివరాత్రి: భక్తులకు మజ్జిగ పంపిణీ చేసిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం పట్టణం నందు మహాశివరాత్రి సందర్భంగా విచ్చేసిన వేలాది భక్తులకు మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేసి భక్తులకు మజ్జిగ అందజేసిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా వేలాది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుందని, కాస్తున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని వారి దాహం తీర్చుటకు నా వంతు సహాయంగా మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు వేలాది మంది భక్తులు పాలుపంచుకొని వారి దాహాన్ని తీర్చుకోవాలని జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ కొనియాడారు. గతంలో కూడా మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పుడు ఏర్పాటు చేసాం ఇక మీదట కూడా ఏర్పాటు చేస్తూనే ఉంటామని పిఠాపురం నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం నియోజకవర్గ సమస్యలపై పోరాటాలు చేయడం వంటి అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముందు వాపోయారు. ఈ కార్యక్రమంలో భాగంగా
ఎక్స్ సర్పంచ్ గరగా సత్యానంద రావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ జ్యోతుల సతీష్, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి జవ్వాది జోగేశ్వరరావు, దుడ్డు నాగు, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, బొజ్జ గోపికృష్ణ, దుడ్డు రాంబాబు, టైల్స్ బాబీ, పి ఎస్ ఎన్ మూర్తి, గొల్లపల్లి శివ, ఇంటి వీరబాబు, కంద శ్రీను, గంగ, కంద చక్ర బాబు, సోడిశెట్టి బూరయ్యకాపు, మేడిది బాబ్జి, బిజెపి నాయకులు తోట ఏడుకొండలు, పిల్లా వీరబాబు, తంగేటి సింహాచలం, దాసం పట్టాభి, బిజెపి నాయకులు కర్నేటి తాతీలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.