పెరాలసిస్ బాధితులకు అండగా నిలిచిన డాక్టర్ పిల్లా శ్రీధర్

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పిఠాపురం మిరపకాయలు వీధిలో పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్న దువ్వ లక్ష్మీ కాంతారావునీ పరామర్శించి, వారి అనారోగ్యం పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది, వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం బియ్యం బస్తా మరియు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. మరియు ఆరో వార్డుకు చెందిన ఎలమంచిలి రత్నావతి పెరాల్సిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకొని వెంటనే నేనున్నాను అని భరోసా ఇచ్చి వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం బియ్యం బస్తా మరియు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాటి మధుబాబు, మాగాపు సతీష్, నందిన విజయకుమార్, వమ్ము మంగ, బొమ్మిడి నరసింహారావు, రామకృష్ణ, మంగ, బాలాజీ, శివ, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.