పెనుమల్ల మంగిరెడ్డిని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలం ఎస్ఈజెడ్ నందు పెనుమల్ల మంగిరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గుండె ఆపరేషన్ చేపించుకొని ఇంటికి వచ్చినటువంటి మంగిరెడ్డిని పరామర్శించిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని తగిన ఆరోగ్యపరమైన సూచనలను సలహాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పెనుమల్ల సూర్య ప్రకాష్, ముమ్మిడి గంగ, సూర్యచంద్ర, నల్ల అర్జబాబు, మత్స్యకార నాయకులు పల్లెటి బాపన దొర, పల్లెటి నగేష్, జిలకర సత్తిబాబు, బోజ్జ గోపికృష్ణ, పల్నాటి మధుబాబు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.