పూడకతీత పనులను ప్రారంభించి పర్యవేక్షించిన డాక్టర్ రమేష్ బాబు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మల్కిపురం మండలం చింతలమోరి గ్రామంలో గత 20 సంవత్సరాలు పైగా పాలకుల నిర్లక్ష్యంతో పూడికతీతకు నోచుకోనటువంటి దాసులపుంత నుండి ఉప్పుకాలువ డ్రైన్ వల్ల మొన్న వచ్చిన మిచౌంగ్ తుఫాన్ వల్ల, కోతకు వచ్చిన వరిచేలు మునిగిపోగా రైతులు తీవ్ర ఇబ్బందితో సర్పంచ్ వద్ద ఆవేదనను వ్యక్తం చేయగా వెంటనే స్పందించి పూడకతీత పనులను గ్రామ సర్పంచ్ రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు ప్రారంభించి దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది.