ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న డా.సంపత్ నాయక్

తెలంగాణ, వైరా, జూలూరుపాడు మండలం, సోమవారం పలు గ్రామాల్లో బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా.సంపత్ నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికై ఒక్క అవకాశమివ్వాలని, మీ అమూల్యమైన ఓటును జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, బిజెపి ముఖ్య నాయకులు మండల గ్రామ కమిటీ సభ్యులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.