దసరా మహోత్సవ పూజల్లో జనసేన నాయకులు డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్టణం నందు అగ్రహారం ఒకటో వార్డులో రెల్లి వీధి నందు దసరా మహోత్సవాల్లో సందర్భంగా శుక్రవారం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అవతారం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పూజా కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ని ప్రేమ పూర్వకంగా దుశ్శాలువాతో సన్మానించి హారతులతో స్వాగతం పలికిన రెల్లి సోదరులు. పూజలో పాల్గొన్న డాక్టర్ శ్రీధర్ అమ్మవారిని దర్శించుకుని 5116/- రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా అల్లం కిషోర్, అల్లం కుమార్, పోతునురి లక్ష్మణ్, బి.శ్రీనివాసు, ఏ.శ్రీను, పి.గణేష్, ఏ.దుర్గ, ఏ.సాయికుమార్, ఏ.రాజ, ఏ.ఈశ్వర్, ఎన్.దేవేంద్ర, ఎన్.సురేష్, ఏ.సంతోష్ కుమార్, ఎం.వీర నాగు తదితర జనసైనికులు పాల్గొన్నారు.